ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

జననమా - మరణమా! - M.S. Swaminathan and Bagath singh

                                        Bhagyamati✍️

  హరిత విప్లవ పితామహుడు, భారతరత్న గ్రహీత, భారతదేశపు ఆధునిక వ్యవసాయ అభివృద్ధి విధాన రూపకర్త... 

ఎం.ఎస్ స్వామినాథన్ ఈ రోజు మరణించారు.

   నేడు ప్రపంచంలో గోధుమ పంటను ఉత్పత్తి చేసే దేశాలలో భారతదేశం ముందు వరుసలో ఉంది. 1960 లలో ఇదే భారతదేశం గోధుమలను, అమెరికా నుండి దిగుమతి చేసుకునేది అంటే నమ్మడం కష్టమే. గోధుమలను దిగుమతి చేసుకునే స్థాయి నుండి ఎగుమతి చేసే స్థాయి వరకు తీసుకురావడానికి కృషి చేసిన వారు స్వామినాథన్. ఈయన హరిత విప్లవం ద్వారా మనదేశంలో  కొత్తరకం గోధుమ మరియు వరి వంగడాలను ప్రవేశపెట్టడం ద్వారా వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న, బాజ్రా పంటల ఉత్పత్తిని తారాస్థాయిలో పెంచగలిగారు. అందుకే ఇది హరిత విప్లవం కాదు వ్యవసాయ విప్లవం అంటారు.


     1966లో ప్రారంభించిన ఈ హరిత విప్లవ ప్రభావం ఆహార ధాన్యాల ఉత్పత్తిని 81 మిలియన్ టన్నుల నుంచి ఇప్పటికీ 300 మిలియన్ టన్నులకు పెంచిందంటే ఆశ్చర్యమే. భారతదేశంలో జీవనోపాధిగా ఉన్న వ్యవసాయాన్ని, వ్యవసాయ పరిశ్రమగా మార్చింది ఈ హరిత విప్లవం. 

     వ్యవసాయ రంగానికి పారిశ్రామిక రంగానికి అనుబంధం పెరిగేలా... వ్యవసాయానికి అవసరమైన విత్తన, ఎరువుల, పనిముట్ల పరిశ్రమ స్థాపన దేశంలో ఊపందుకుంది. ఈ హరిత విప్లవం వ్యవసాయ రంగ అభివృద్ధికే కాదు, మన దేశంలో పారిశ్రామిక రంగ అభివృద్ధికి కూడా తోడ్పాటు చేసింది.

ఆంగ్లేయులు, మొఘలులు ఊడ్చేసి పోగా... మిగిలిన పేదరికం దేశమంతా... వ్యాపించి ఉన్నపుడు...

తిండి గింజలు దొరకక పేదవాడు ప్రాణాలు వదిలేటప్పుడు...



సరిపడా ఆహార ధాన్యాలను దేశమంతటా అందించగలిగింది., ఈ హరిత విప్లవం. సాధారణ రైతును ధనవంతునిగా మార్చి సాంఘిక హోదాను తెచ్చిపట్టింది ఈ విప్లవం.

    2006లో మరల ప్రధాని మన్మోహన్ సింగ్ రెండవ హరిత విప్లవం కోసం స్వామినాథన్ కు పిలుపునంపారు. ఈసారి స్వామినాథన్ జాతీయ వ్యవసాయ కమిషన్ అధ్యక్షునిగా 'యవర్ గ్రీన్ రెవల్యూషన్' కి పిలుపునిచ్చారు. ఇందులో సేంద్రియ వ్యవసాయానికి కూడా పెద్దపీట వేశారు. బయోటెక్నాలజీ ని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ని రైతులు ఉపయోగించుకునేలా... రైతులపై జాతీయ విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రస్తుతం వీరు.. స్వయంగా స్థాపించిన  'ఎం.ఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్' కు చైర్మన్ గా వ్యవహరిస్తూ ఉన్నారు.

    


    ఈరోజు స్వాతంత్ర్య విప్లవకారుడు 'భగత్ సింగ్' గారి  జననం... వ్యవసాయ విప్లవకారుడు 'ఎం. ఎస్  స్వామినాథన్' గారి మరణం... దేశం కోసం ప్రాణం నిలిపిన ఈ ఇద్దరి దేశభక్తులకు... పోరాట వీరులకు... 'సెప్టెంబర్ 28' అంకితం. భగత్ సింగ్ ఢిల్లీ వీధుల్లో... ఎర్ర కాగితాలు జల్లి జనాలలో చైతన్యం రేపాడు. స్వామినాథన్ ఈ దేశపు మట్టి పై... పచ్చ కాగితాలు జల్లి రైతులలో చైతన్యం నింపాడు. ఈ అమర జీవులకు లాల్ సలాం✊ జైహింద్.

Thank you 🙏

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నా మొదటి ప్రేమ... మా నాన్న!

  ఒక అమ్మాయి ఏ వయసులో అయినా ఉండొచ్చు కానీ ఆమె ఎప్పటికీ తన తండ్రికి చిన్ని యువరాణిగానే ఉంటుంది.  తండ్రీ కూతుళ్ల మధ్య ఉన్న ఈ ప్రత్యేక బంధం... ఆరాధ్య బంధం!.  ఒక తండ్రి తన కూతురిపై ఉంచే హద్దులు లేని ప్రేమ ఎప్పటికీ తిరిగి చెల్లించలేనిది.   బెస్ట్ ఫ్రండ్ తో షాపింగ్:  నేను రత్నం జూనియర్ కాలేజి లో చదివేటప్పుడు కాలేజి వ్యాన్, ఇల్లు తప్ప ఏం తెలియదు. డిగ్రీ కి వచ్చాక న బెస్ట్ ఫ్రెండ్ శ్వేత తో మొదటిసారి బయటకి వెళ్ళాను. ఫస్ట్ టైం వెళ్ళడం, నాన్నకి trunk road లో కనిపించాను. నా మైండ్ బ్లోక్ అయ్యి రెడ్ అయ్యి, బ్లూ అయ్యింది. మా నాన్న మాత్రం సింపుల్ గా షాపింగ్ కి వచ్చావా? డబ్బులు ఉన్నాయా? అంటూ 2000 ఇచ్చేసి వెళ్ళాడు. నాన్న అంటే అంతే మరి, నెక్స్ట్ లెవెల్.  నేను పెద్ద చిరంజీవి అభిమాని ని. నాన్న ఫస్ట్ డే ఫస్ట్ షో చిరంజీవి మూవీ కి తీసుకుని వెళ్తాడు. నేను తిరుపతి లో M.SC చేసేప్పుడు నాకోసం dairy milk బాక్స్లు కొరియర్ చేసేవాడు. చిరంజవి గ్రీటింగ్స్ పంపేవాడు. నాన్నకి నేను ఎప్పటికీ చిన్న పిల్లనే. నేను అబద్ధాలు చెప్పను. ఇప్పటికీ చెప్పను. అందుకే నన్ను మా అమ్మ, నాన్న బాగా నమ్ముతారు. నా ప్రాణ స్నేహితుడు నాన్న: చిన్నపుడ

ఇప్పటికి మేల్కున్నావా స్వామి?!

 తడిసి నీళ్ళోడుతున్న చీర కొంగును పిండుకుంటూ... అల్లంత దూరాన ఉన్న అతనిని చూసాను. కడవ నడుముకెత్తి తిరిగి మళ్ళీ మళ్ళీ చూసాను. ఎదుట ఏటుగట్టు వెనకనుంచి చుమ్మలు చుట్టుకుంటూ... తెల్లని పొగతెరలు, చెట్ల ముసుగులు దాటి వచ్చాను.  మామిడి చెట్టు ఆకుల గుబురుల్లోంచి, సన్నగా పడుతున్న నులి వెచ్చని సూర్యకిరణాలు.... మడత మంచంపై మాగన్నుగా పడుకుని ఉన్న నా మన్మధుడు. ఓయ్... అని కేక వేయాలనుంది, వాలుగాలిలో మాట కొట్టుకుని పోదా అని ఆగిపోయాను. తడక మీద ఆరవేసిన తుండువా లాగి దులుపుదామనుకున్నాను. గడుసుదనుకుంటాడని గమ్మునుండి పోయాను. పొగమంచు మేఘాల మధ్య చాచుకునే ఉంది. పసిడి పువ్వులు నా పిరికితనం చూసి నవ్వుకుంటున్నాయి. చెట్టు కొమ్మన కౌగిలించుకున్న రామచిలుకలు నీ మాటేమిటి? అని ఆరా తీశాయి.  సరే! నడుము మీద కడవ నిలవకుంది, అతనితో గొడవ పడమంది. నెత్తిన కుమ్మరిస్తే మేలుకొంటాడుగా?! అమ్మో కయ్యాలవాడు మాటలే కట్టేస్తాడు. వద్దులే రేగిపోయిన జుట్టును ముడి వేసుకుంటూ పక్కనే ఓ పూచిక పుల్ల కోసం వెతికాను. ఈ పడుచు వాడి కలలో ఏమొస్తుందో... నిద్రలోనే నవ్వాడు. చక్కనోడు చెంప మీద చంద్రవంకలు పూచాయి. మర్రి చెట్టు కాయలు ముసిముసిగా నవ్వుతూ... పుల్ల ఒకటి వ

ఇది యుగాలనాటి ప్రేమ!.

 రాధంటే... ఉత్తదేహం కాదు, ఉత్త మనసే కాదు, రాధంటే ఆత్మ. కృష్ణుని ప్రేమలో లీనమైన ఆత్మ. ప్రపంచానికి అర్థం కాని ఎన్నో విషయాలలో వీరి ఇరువురి ప్రేమ కూడా ఒకటి. వీరి శృంగారం మానసికమే! కానీ ఆత్మసంబంధం. ఏ ప్రేమ కథకైనా వీరే ఆదర్శం. ప్రేమ యొక్క గొప్పతనం పట్టాలంటే... కథలో చిత్రించే పాత్రలను రాధాకృష్ణలను ఊహించే రాయాలి. కృష్ణుని పై ఆశలు రేకెత్తించుకొని మనసును కృంగ దీసుకున్న రాధ ప్రేమ లోంచి విరహం అనే పదం పుట్టుకొచ్చిందేమో?! ప్రేమంటే మనసంతా కాముఖత్వం పులుముకోవడం కాదు, దేహవసరాలను తీర్చుకోవడం కాదు, ప్రేమంటే విశాలత్వం, దైవత్వం, విరహం, తపన, వేదన, ఎడబాటు, త్యాగం, కృష్ణుని రూపు కోసం పరితపించే రాధ దినచర్య. అందుకే రాధాకృష్ణుల ప్రేమ ఉత్త ప్రబంధ కథగా కాకుండా... యుగాలు చెప్పుకునే గొప్ప ప్రేమగాధ గా మిగిలింది. ఒక ప్రేమ కథను పైకెత్తి ఆకాశంలో ప్రవేశపెట్టాలన్నా... ఒక ప్రేమ గీతాన్ని, స్వర్గాన్ని తాకేంత ఆనందంగా ఆలాపించాలన్నా... రాధాకృష్ణుల ప్రేమే ప్రేరణ. ఇంత గొప్పగా మనం ప్రేమించాలంటే రోజు మనసుకి మెదడుకి మధ్య దేవాసుర యుద్ధమే జరుగుతుంది, అయినా నిలబడితేనే ప్రేమ గెలుస్తుంది. ఇక్కడ గెలవడం అంటే ఇద్దరు పెళ్లి చేసుకొని జీవించటం