ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

భూమి మానవులకు చెందదు; మానవులు భూమికి చెందినవారు - Human and Earth

                                  

భూమి పుట్టుక - Birth of Earth:-

             మానవుడు అనే మాట పుట్టక ముందే భూమి పుట్టింది. మానవుని ఉనికిని తెలుసుకోవడానికి డార్విన్, అరిస్టాటిల్ వంటి గొప్ప శాస్త్రవేత్తలు, చరిత్రకారులు ఎందరో ఉన్నారు.  మానవుని పుట్టుక, ఉనికి,  మనుగడ, అభివృద్ధి... ఇవన్నీ మానవ సమాజం అనే పదం లోనివే. ఇవన్నీ అర్థం కావాలంటే అంతకంటే ముందు నుండి ఉన్న భూమి గురించి తెలుసుకోవాలి. 

   
       భూమి గురించి చెప్పాలంటే ఒక ఖగోళ శాస్త్రవేత్త గ్రహం గాను, ఒక చరిత్రకారుడు చరిత్రకు పునాది గాను, ఒక పురావస్తు శాస్త్రవేత్త సంపదల గని గాను, ఒక సాధారణ రైతు అన్నం పెట్టే అమ్మ గాను, భావిస్తారు. అదే మనలాంటి సాధారణ ప్రజానికం భూమిని దేశంగా భావిస్తాం. ఈ భూమి కోసం చేసిన స్వతంత్ర పోరాటాలు మనలో ఈ దేశం పట్ల, నేల పట్ల దేశభక్తిని, ఐక్యతను పెంపొందించాయి.       

భూమి పై జీవుల పుట్టుక -       

      ఎన్నో లక్షల ఏళ్ల క్రితమే భూమి పుట్టింది. మానవుడి మనుగడ లేక ముందే భూమి పుట్టిన 100 కోట్ల సంవత్సరాలకు, అంటే క్రితం 350కోట్ల సంవత్సరాలప్పుడు ఏకకణ జీవులు అంటే బాక్టీరియా కేంద్రక పూర్వ జీవులు ఆవిర్భవించాయి. పక్షులు, ఎన్నో రకాల జీవులు మనుగడ సాగించాయి, అంతరించాయి కూడా. కానీ యుగాలు గడిచాక మానవుని జననం, ఉనికిని ఈ భూమిపై తెలుసుకున్నాము. 

 అభివృద్ధి చెందిన జీవరాశి గా మానవుడు భూమిపై జీవనశైలిని మామూలు జీవరాశుల లాగే ఆరంభించి, పూర్తిస్థాయి నాగరికుడిగా మారాడు.  ఏ జీవరాశి కూడా భూమిపై స్వయంగా ఆహారం తయారు చేసుకునే ప్రయత్నం చేయలేదు. చిన్న జీవుల్ని పెద్ద జీవులు, వాటిని మరింత పెద్ద జీవులు ఆహారంగా వినియోగించుకుంటూ జీవనం సాగించాయి. దీనినే మనం పర్యావరణ శాస్త్రంలో ఆహారపు గొలుసు గా చదువుకున్నాము.


భూమిని సాగుచేయడం:-

     మానవుడు మాత్రం భూమిని దున్నడం,  విత్తనం నాటడం, సాగు చేయడం, పంటలు పండించడం, ఉత్పత్తులు, వినియోగాలు ఇలా ఎన్నో వాణిజ్య పదాలకు నాంది పలికాడు.  మొట్టమొదటి పాత రాతి యుగపు మానవుడు ఆహారపు గొలుసు జీవన శైలిలో జీవించినా,  మధ్యయుగ కాలం నాటికి భూమిని దున్నడం, సాగు చేయడం, పంటలు పండించడం  నేర్చుకున్నాడు. భూమిపై పూర్తిగా ఆధారపడ్డ మనిషి భూమిని తల్లిగా 'భూమాత'గా భావించి పూజించాడు. 



ఆధునీకరణ:-

       ఆధునిక కాలం నాటికి అంతా తారుమారైన మనిషి జీవనశైలి, భూమి ని ఆహారం పండించే నేలగా, తల్లిగా మాత్రమే చూడలేదు. మైదానాలు పీఠభూములుగా విభజించబడ్డ భూమి వైనం, మానవుడి మేధాశక్తిని పోరాటాల వైపు తిప్పింది.  విశాలమైన జీవ నదులు గంగా, యమునా, గోదావరి, కృష్ణా ప్రవహించే నేల బంగారు భూమిగా పేరుగాంచింది. ఈ నేల మైదానాలుగా, ఈ నేలపై పండించే మనిషి ధనవంతుడిగా, ఆ నేల ఉన్న దేశం సంపన్న దేశంగా గుర్తింపు పొందాయి. ఈ మైదానాలు కలిగిన భూమి కోసం జాతులుగా, ప్రాంతాలుగా విడిపోయిన మానవులు పోరాటాలు చేశారు,  యుద్ధాలు చేశారు. రాజ్యాలు, దేశాలు ఏర్పడ్డాయి. రాజులు, సామంతులు తయారు గావించబడ్డారు. 

      ఈ భూమిపై పంట పండించడం, ఆహారం ఉత్పత్తి చేసుకోవడం కాక మనిషి మరెన్నో అద్భుతాలు చేశాడు. భూమి లో లోపల భూగర్భంలో దాగి ఉన్న వజ్రాలు, రత్నాలు, బంగారం, ఇనుము వంటి లోహాలను వెలికి తీయడం నేర్చుకున్నాడు. వీటితో సంపాదన సృష్టించాడు. అంతటితో తృప్తి చెందని మనిషి ఈ సంపదతో విదేశీ వ్యాపారాలు, ఆక్రమణలు చేశాడు.  సృష్టించిన లేదా కొల్లగొట్టిన సంపదతో ఇదే నేలపై భూతల స్వర్గాలను నిర్మించాడు.  తాజ్ మహల్ లాంటి ఎన్నో అద్భుతాలను ఈ నేల పై మనం ఎన్నో చూడగలం. 


     రత్నాలు, లోహాలు కాక పెట్రోల్, డీజిల్ వంటి ఎన్నో ఇంధనాలను ఈ భూమి నుంచి వెలికి తీయడం నేర్చుకున్నాడు. ఇంధనాలను వాడే యంత్రాలను, పరికరాలను, వాహనాలను కనుగొని నాగరికతలో భాగంగా మనిషి ఎన్నో ఏళ్ల నుంచి ఉపయోగిస్తున్నాడు. 

అంతరిక్ష పరిశోధన:-

  మనిషి జననం... ఈ భూమిపై ఎంత అద్భుతమో... మనిషి ఉన్నతి, అభివృద్ధి,  నాగరికత కూడా అద్భుతాలే!. భూమిపై ఎన్నో జీవరాసులు చేయలేని ఘనతను మానవుడు సాధించాడు.  భూమిపై ఎన్నో పరిశోధనలు గావించాడు. సూర్యుడు, చంద్రుడు భూమిపై జీవరాశులకు ఆధారమని తెలుసుకున్న తొలియుగం మానవుడు వీరిని దేవతలుగా భావించి పూజించారు. నేడు ఇదే మానవుడు శాస్త్రవేత్తగా మారి గ్రహ మండలాన్ని కనుగొన్నాడు.  భూమిని ఒక గ్రహంగా దానికి ఆధారమైన గ్రహాలుగా సూర్యుడు, చంద్రుడు మన విజ్ఞానానికి తారసపడతారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకున్న మనిషి అంతరిక్ష శాస్త్రాన్ని కూడా కనుగొన్నాడు. 

     అంతరిక్షానికి వెళ్లడం,  ప్రయోగాలు చేయడం, చంద్రునిపై కాలు మోపడం,  చంద్రయాన్ ప్రయోగాలు ఇందుకు మంచి ఉదాహరణలు. ఇంకా భావితరాలు ఇదే నేలపై పుట్టి ఎంతో ఎత్తుకు ఎదిగి చంద్రునిపై కాలు పెట్టడమే కాదు, మరెన్నో అద్భుతాలు సాధించాలి. 




అభివృధి - భూమి కాలుష్యం:-

          " మార్కెట్ ఎల్లప్పుడూ సరైనది" అనేది అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక విధానాలలో ఒకే విధంగా ప్రబలంగా ఉన్న ఆలోచన. పరిశ్రమలు ఒక విప్లవం లా... రావడం, వాతావరణ మార్పు మరియు భారీ స్థాయిలో పర్యావరణ క్షీణత కు కారణమైంది. స్థానిక ప్రజలు భూమి, నీరు మరియు అనేక ఇతర వనరులకు సంరక్షకులుగా ఉన్నారు, కానీ నీరు ప్రభుత్వాల బాధ్యతగా ఉండటం తో నీటి కాలుష్యం నుండి రక్షణ కరువైంది. నీరు కూడా కొనుక్కునే స్థితికి వచ్చాము. ఈ ఆలోచనా విధానం మారాలి  మానవుల ఆధ్యాత్మిక కోణాలను, విశ్వంలోని అన్ని అంశాల అనుసంధానంతో మనిషి లో కొత్త ఆలోచన రావాలి. సహజ వనరులను కాపాడుకోవాలి.

      ఎన్ని చేసినా, ఎంత చేసినా... ఈ నేల నాకు 'తల్లి' అనే భావన ప్రతి మనిషిలో అలానే ఉండాలి. ఎందుకంటే భూమికి మనిషి అవసరం లేదు, మనిషికే భూమితో అవసరం. ఇదే నేలపై, ఇదే మట్టిలో జన్మిస్తాము,  జీవిస్తాము, మరణించి ఇదే మట్టిలో ఒక రేణువై కలిసిపోతాం. నేల తల్లికి వందనం, నా తెలుగుతల్లి కి వందనం.  దేశమoటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయి. జైహింద్🙏🙏🙏

                             

Thank you 🙏🏻                              Bhagyamati✍🏻

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నా మొదటి ప్రేమ... మా నాన్న!

  ఒక అమ్మాయి ఏ వయసులో అయినా ఉండొచ్చు కానీ ఆమె ఎప్పటికీ తన తండ్రికి చిన్ని యువరాణిగానే ఉంటుంది.  తండ్రీ కూతుళ్ల మధ్య ఉన్న ఈ ప్రత్యేక బంధం... ఆరాధ్య బంధం!.  ఒక తండ్రి తన కూతురిపై ఉంచే హద్దులు లేని ప్రేమ ఎప్పటికీ తిరిగి చెల్లించలేనిది.   బెస్ట్ ఫ్రండ్ తో షాపింగ్:  నేను రత్నం జూనియర్ కాలేజి లో చదివేటప్పుడు కాలేజి వ్యాన్, ఇల్లు తప్ప ఏం తెలియదు. డిగ్రీ కి వచ్చాక న బెస్ట్ ఫ్రెండ్ శ్వేత తో మొదటిసారి బయటకి వెళ్ళాను. ఫస్ట్ టైం వెళ్ళడం, నాన్నకి trunk road లో కనిపించాను. నా మైండ్ బ్లోక్ అయ్యి రెడ్ అయ్యి, బ్లూ అయ్యింది. మా నాన్న మాత్రం సింపుల్ గా షాపింగ్ కి వచ్చావా? డబ్బులు ఉన్నాయా? అంటూ 2000 ఇచ్చేసి వెళ్ళాడు. నాన్న అంటే అంతే మరి, నెక్స్ట్ లెవెల్.  నేను పెద్ద చిరంజీవి అభిమాని ని. నాన్న ఫస్ట్ డే ఫస్ట్ షో చిరంజీవి మూవీ కి తీసుకుని వెళ్తాడు. నేను తిరుపతి లో M.SC చేసేప్పుడు నాకోసం dairy milk బాక్స్లు కొరియర్ చేసేవాడు. చిరంజవి గ్రీటింగ్స్ పంపేవాడు. నాన్నకి నేను ఎప్పటికీ చిన్న పిల్లనే. నేను అబద్ధాలు చెప్పను. ఇప్పటికీ చెప్పను. అందుకే నన్ను మా అమ్మ, నాన్న బాగా నమ్ముతారు. నా ప్రాణ స్నేహితుడు నాన్న: చిన్నపుడ

ఇప్పటికి మేల్కున్నావా స్వామి?!

 తడిసి నీళ్ళోడుతున్న చీర కొంగును పిండుకుంటూ... అల్లంత దూరాన ఉన్న అతనిని చూసాను. కడవ నడుముకెత్తి తిరిగి మళ్ళీ మళ్ళీ చూసాను. ఎదుట ఏటుగట్టు వెనకనుంచి చుమ్మలు చుట్టుకుంటూ... తెల్లని పొగతెరలు, చెట్ల ముసుగులు దాటి వచ్చాను.  మామిడి చెట్టు ఆకుల గుబురుల్లోంచి, సన్నగా పడుతున్న నులి వెచ్చని సూర్యకిరణాలు.... మడత మంచంపై మాగన్నుగా పడుకుని ఉన్న నా మన్మధుడు. ఓయ్... అని కేక వేయాలనుంది, వాలుగాలిలో మాట కొట్టుకుని పోదా అని ఆగిపోయాను. తడక మీద ఆరవేసిన తుండువా లాగి దులుపుదామనుకున్నాను. గడుసుదనుకుంటాడని గమ్మునుండి పోయాను. పొగమంచు మేఘాల మధ్య చాచుకునే ఉంది. పసిడి పువ్వులు నా పిరికితనం చూసి నవ్వుకుంటున్నాయి. చెట్టు కొమ్మన కౌగిలించుకున్న రామచిలుకలు నీ మాటేమిటి? అని ఆరా తీశాయి.  సరే! నడుము మీద కడవ నిలవకుంది, అతనితో గొడవ పడమంది. నెత్తిన కుమ్మరిస్తే మేలుకొంటాడుగా?! అమ్మో కయ్యాలవాడు మాటలే కట్టేస్తాడు. వద్దులే రేగిపోయిన జుట్టును ముడి వేసుకుంటూ పక్కనే ఓ పూచిక పుల్ల కోసం వెతికాను. ఈ పడుచు వాడి కలలో ఏమొస్తుందో... నిద్రలోనే నవ్వాడు. చక్కనోడు చెంప మీద చంద్రవంకలు పూచాయి. మర్రి చెట్టు కాయలు ముసిముసిగా నవ్వుతూ... పుల్ల ఒకటి వ

ఇది యుగాలనాటి ప్రేమ!.

 రాధంటే... ఉత్తదేహం కాదు, ఉత్త మనసే కాదు, రాధంటే ఆత్మ. కృష్ణుని ప్రేమలో లీనమైన ఆత్మ. ప్రపంచానికి అర్థం కాని ఎన్నో విషయాలలో వీరి ఇరువురి ప్రేమ కూడా ఒకటి. వీరి శృంగారం మానసికమే! కానీ ఆత్మసంబంధం. ఏ ప్రేమ కథకైనా వీరే ఆదర్శం. ప్రేమ యొక్క గొప్పతనం పట్టాలంటే... కథలో చిత్రించే పాత్రలను రాధాకృష్ణలను ఊహించే రాయాలి. కృష్ణుని పై ఆశలు రేకెత్తించుకొని మనసును కృంగ దీసుకున్న రాధ ప్రేమ లోంచి విరహం అనే పదం పుట్టుకొచ్చిందేమో?! ప్రేమంటే మనసంతా కాముఖత్వం పులుముకోవడం కాదు, దేహవసరాలను తీర్చుకోవడం కాదు, ప్రేమంటే విశాలత్వం, దైవత్వం, విరహం, తపన, వేదన, ఎడబాటు, త్యాగం, కృష్ణుని రూపు కోసం పరితపించే రాధ దినచర్య. అందుకే రాధాకృష్ణుల ప్రేమ ఉత్త ప్రబంధ కథగా కాకుండా... యుగాలు చెప్పుకునే గొప్ప ప్రేమగాధ గా మిగిలింది. ఒక ప్రేమ కథను పైకెత్తి ఆకాశంలో ప్రవేశపెట్టాలన్నా... ఒక ప్రేమ గీతాన్ని, స్వర్గాన్ని తాకేంత ఆనందంగా ఆలాపించాలన్నా... రాధాకృష్ణుల ప్రేమే ప్రేరణ. ఇంత గొప్పగా మనం ప్రేమించాలంటే రోజు మనసుకి మెదడుకి మధ్య దేవాసుర యుద్ధమే జరుగుతుంది, అయినా నిలబడితేనే ప్రేమ గెలుస్తుంది. ఇక్కడ గెలవడం అంటే ఇద్దరు పెళ్లి చేసుకొని జీవించటం